వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన అవసరం
ABN, First Publish Date - 2020-11-13T05:57:34+05:30
వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం. భరతలక్ష్మి అన్నారు.
మాడుగుల రూరల్, నవంబరు 12 : వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం. భరతలక్ష్మి అన్నారు. గురువారం గాదిరాయిలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. రైతులు ఆధునిక పద్ధతుల్లో సాగు చేయాలన్నారు. విత్తన మార్పిడితోపాటు అపరాలు సాగుపై దృష్టిసారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొండెంపూడి కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు సత్తిబాబు, మానస, గౌరీ, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ రాజ్కుమార్, మహేశ్, ఏవో నిర్మలజ్యోతి, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-13T05:57:34+05:30 IST