ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని రకాల పంటలకు పరిహారం చెల్లిస్తాం

ABN, First Publish Date - 2020-12-06T04:08:25+05:30

విశాఖ- రాయపూర్‌ ఎక్సప్రెస్‌ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వారి భూముల్లో సాగులో ఉన్న ప్రతి పంట, చెట్లు, బావులు, బోర్లుకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ఎన్‌హెచ్‌-16 డిప్యూటీ తహసీల్దార్‌ రాజావిక్రమార్క్‌ తెలిపారు.

రైతులతో మాట్లాడుతున్న డీటీ రాజావిక్రమార్క్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిప్యూటీ తహసీల్దార్‌ రాజా విక్రమార్క్‌


సబ్బవరం, డిసెంబరు 5 : విశాఖ- రాయపూర్‌ ఎక్సప్రెస్‌ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వారి భూముల్లో సాగులో ఉన్న ప్రతి పంట, చెట్లు, బావులు, బోర్లుకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ఎన్‌హెచ్‌-16 డిప్యూటీ తహసీల్దార్‌ రాజావిక్రమార్క్‌ తెలిపారు. మండలంలోని మలునాయుడుపాలెంలో శనివారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా భూములు పరిశీలించి సర్వే నంబర్లు వారీ సర్వే చేస్తామని, తరువాత ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. పరిహారం చెల్లించాకే భూములు అభివృద్ధి చేస్తామని రైతులకు వివరించారు. రైతులకు ఉన్న పలు అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. కార్యక్రమంలో వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు సబ్బవరపు త్రినాఽథరామకాసు, రైతులు బోని గంగునాయుడు, మాజీ ఎంపీపీ గండి దేముడు, మాజీ ఎంపీటీసీ శింగంపల్లి సత్యం, పి.దేముడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T04:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising