ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకునిపై హత్యాయత్నం

ABN, First Publish Date - 2020-08-07T10:19:01+05:30

ఎంవీపీ జోన్‌పీఎస్‌ పరిధి అప్పుఘర్‌ ప్రాంతంలో బుధవారం రాత్రి ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంవీపీ కాలనీ, ఆగస్టు 6: ఎంవీపీ జోన్‌పీఎస్‌ పరిధి అప్పుఘర్‌ ప్రాంతంలో బుధవారం రాత్రి ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ఎంవీపీ జోన్‌ సీఐ షణ్ముఖరావు కథనం ప్రకారం... శ్రీకాకుళానికి చెందిన ఎం. దుర్గాప్రసాద్‌ (23) అనే వ్యక్తి కారు వాషింగ్‌ చేస్తూ గత కొంతకాలంలో అప్పుఘర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.


ఆ వ్యక్తి ఇదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను ప్రేమించాడని, ఇది ఇష్టంలేని ఆమె తల్లిదండ్రులు గతంలో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని సీఐ తెలిపారు. దీంతో దుర్గాప్రసాద్‌పై కేసు నమోదైందన్నారు. అయితే బుధవారం ఆర్థరాత్రి 12 గంటల సమయంలో దుర్గాప్రసాద్‌ పురుగుమందు వాసనతో ఎంవీపీ జోన్‌ పీఎస్‌కు వచ్చాడన్నారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అప్పుఘర్‌ ప్రాంతంలో తనతో బలవంతంగా పురుగుల మందు తాగించారని ఫిర్యాదు చేశాడన్నారు. అతనిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కి తరలించామని, పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. హత్యాయత్నం కింద కేసు నమోదుచేసిన దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

Updated Date - 2020-08-07T10:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising