ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన

ABN, First Publish Date - 2020-12-12T04:34:31+05:30

స్థానిక ఏకలవ్య ఆదర్శ పాఠశాల భవనం నిర్మాణానికి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

పాఠశాల భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ భాగ్యలక్ష్మి, మాధవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చింతపల్లి, డిసెంబరు 11: స్థానిక ఏకలవ్య ఆదర్శ పాఠశాల భవనం నిర్మాణానికి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి శుక్రవారం శంకుస్థాపన చేశారు. పాఠశాల భవనాల నిర్మాణానికి తొలివిడతగా కేంద్ర ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా తరగతి, వసతి భవనాలు, భోజనశాలలు, ఉపాధ్యాయుల నివాస గృహాలు నిర్మించనున్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ జల్లి హలియారాణి, ఎంపీడీవో ఉషశ్రీ, ప్రిన్సిపాల్‌ అన్నామణి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:34:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising