విశాఖలో విశ్వ హిందూపరిషత్, హిందూ ధార్మిక సంస్థల నిరసన
ABN, First Publish Date - 2020-09-21T18:39:32+05:30
విశాఖ డాబాగార్డెన్స్ జంక్షన్లో విశ్వ హిందు పరిషత్, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు సోమవారం నిరసనకు దిగారు.
విశాఖపట్నం: విశాఖ డాబాగార్డెన్స్ జంక్షన్లో విశ్వ హిందు పరిషత్, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు సోమవారం నిరసనకు దిగారు. హిందూ మతం, వెంకటేశ్వర స్వామి, తిరుమల డిక్లరేషన్పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంత్రి ఫొటోను కాళ్లతో తొక్కి నిరసన చేపట్టారు. టీటీడీలో అన్య మతస్థులు దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి చేయాలని నేతలు డిమాండ్ చేశారు.
Updated Date - 2020-09-21T18:39:32+05:30 IST