విశాఖలో ఏపీపీఎస్సీ గ్రూప్-3 అభ్యర్థుల ఆందోళన
ABN, First Publish Date - 2020-09-14T17:28:23+05:30
విశాఖ కలెక్టరేట్ ఎదుట ఏపీపీఎస్సీ గ్రూప్ -3(2018)కి ఎంపికైన అభ్యర్థులు సోమవారం ఆందోళనకు దిగారు.
విశాఖపట్నం: విశాఖ కలెక్టరేట్ ఎదుట ఏపీపీఎస్సీ గ్రూప్ -3(2018)కి ఎంపికైన అభ్యర్థులు సోమవారం ఆందోళనకు దిగారు. పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన తమకు ఇప్పటి వరకూ నియామకాలు జరపలేదంటూ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎంపికైన 104 మందికి నియామక పత్రాలు వెంటనే అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2020-09-14T17:28:23+05:30 IST