హిందూస్థాన్ షిప్యార్డ్ ఘటనలో మృతులకు కేజీహెచ్లో పోస్టుమార్టం
ABN, First Publish Date - 2020-08-02T17:22:13+05:30
హిందూస్థాన్ షిప్యార్డ్ ఘటనలో మృతులకు కేజీహెచ్లో పోస్టుమార్టం
విశాఖపట్నం: హిందూస్థాన్ షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదంపై కనీసం యాజమాన్యం స్పందించలేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నిన్నటి నుంచే మార్చురీ దగ్గర బంధువులు పడిగాపులుగాస్తున్నారు. మరోవైపు షిప్యార్డ్లో ప్రమాద ఘటనపై కమిటీలు దర్యాప్తు ప్రారంభించాయి.
Updated Date - 2020-08-02T17:22:13+05:30 IST