విజయవాడ: మెట్రోగోడౌన్లో అగ్నిప్రమాదం
ABN, First Publish Date - 2020-08-22T12:14:12+05:30
నగరంలోని హనుమాన్ పేట మెట్రో గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించింది.
విజయవాడ: నగరంలోని హనుమాన్ పేట మెట్రో గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని 12 గంటలుగా మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రి 7 గంటలకే గోడౌన్ మూసివేశారు. గోడౌన్ మూసివేసి ఉన్న నేపథ్యంలో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.25 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గోడౌన్లో ఫెవికాల్, సొల్యూషన్ ఉండడంతో మంటలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. పాదరక్షకలు తయారీకి వాడే మిశ్రమాల స్టోరేజ్ గోడౌన్గా అధికారులు గుర్తించారు.
Updated Date - 2020-08-22T12:14:12+05:30 IST