ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవుడు అంటుంటారు కదా.. ఆయనే ఆశీర్వదించాలి: సీఎం జగన్‌పై ఉండవల్లి

ABN, First Publish Date - 2020-02-19T18:29:15+05:30

జగన్ సర్కార్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: జగన్ సర్కార్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాతో బుధవారం మాట్లాడిన ఆయన.. రాబడి తీవ్రంగా పడిపోయిందని.. కేంద్రం పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. కేంద్రం నుంచి రావలసినవి రావడం లేదని.. ఇక్కడ ఆదాయం కూడా ఏమీ లేదన్నారు. దేశ ఆర్థికపరిస్థితిపై మాజీ ప్రధాని మన్మోహన్ గతంలోనే హెచ్చరించారని.. ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇక రాష్ట్ర పరిస్థితి భయంకరంగా ఉందన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టాక మరింత స్పష్టత వస్తుందన్నారు. దేవుడు ఉన్నాడని తరుచూ సీఎం జగన్ అంటుంటారని.. ఇప్పుడు ఆ దేవుడే ఆయన్ను ఆశీర్వదించాలని ఉండవల్లి అన్నారు. ఇక పోలవరంపై మాట్లాడుతూ.. బడ్జెట్‌లో పోలవరానికి తొలి ప్రాధాన్యమివ్వాలని కోరారు. రాజశేఖర్ రెడ్డి కొడుకు ‘మాట తప్పడు.. మడమ తిప్పడు’ అన్న నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-02-19T18:29:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising