ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారు’

ABN, First Publish Date - 2020-08-13T02:41:18+05:30

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు పగటి కలలు కంటున్నారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం నాడు ఇక్కడ మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు పగటి కలలు కంటున్నారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. నెంబర్ వన్ ద్రోహి బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్రం.. ఇప్పుడు అది ముగిసిన అధ్యయం అంటోందని దుయ్యబట్టారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు ప్యాకేజీ కింద 24 వేల కోట్లు అవసరం ఉంటే.. రూ. వెయ్యి కోట్లు మాత్రమే చెల్లించిందని అన్నారు. కడప ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం, విశాఖ-చెన్నై పరిశ్రమల కారిడార్, విశాఖ-విజయవాడ మెట్రో, పోలవరం, అమరావతి రాజధాని పరిస్థితులు ఏంటని తులసి రెడ్డి ప్రశ్నించారు. 


ఇదే సమయంలో సీఎం జగన్ తీరుపై తులసి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వంలో అగ్రవర్ణ కులాలకు అన్యాయం జరిగిందని అన్నారు. పేదరికాన్ని ప్రమాణికంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పథకాలను అగ్రవర్ణ కులాలకు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ పెళ్లి కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా అగ్రవర్ణ కులాలలోని పేదవారికి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్రాల వ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ అమలు అవుతుంటే, ఏపీలో ఎందుకు అమలు కావడం లేదని ఆయన నిలదీశారు. ఏపీ రాష్ట్రం 10 శాతం ఇడబ్ల్యూఎస్ అమలు చేస్తూ జీఓ ఇవ్వాలని ప్రభుత్వాన్ని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-13T02:41:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising