రైలు కిందపడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-11-03T19:04:17+05:30
రైలు కిందపడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
కర్నూలు: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పాణ్యం మండలం కొల్లూరులో ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రైల్వే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2020-11-03T19:04:17+05:30 IST