రేపటి నుంచి బస్పాస్ల జారీ
ABN, First Publish Date - 2020-10-04T12:05:39+05:30
ప్రజా రవాణా శాఖ (పీటీడీ) సోమవారం నుంచి బస్పాస్లు జారీచేయాలని నిర్ణయించింది. మొదటి దశలో మద్దిలపాలెం, ద్వారకా కాంప్లెక్సు, స్టీల్ సిటీ కాంప్లెక్సులలో పాస్లు
విశాఖపట్నం : ప్రజా రవాణా శాఖ (పీటీడీ) సోమవారం నుంచి బస్పాస్లు జారీచేయాలని నిర్ణయించింది. మొదటి దశలో మద్దిలపాలెం, ద్వారకా కాంప్లెక్సు, స్టీల్ సిటీ కాంప్లెక్సులలో పాస్లు ఇవ్వనున్నట్టు రీజనల్ మేనేజర్ ఎంవై దానం తెలిపారు. జనరల్, ఎన్జీవో, దివ్యాంగుల పాస్లతో పాటు నెలవారీ సీజనల్ టికెట్లు, స్టీల్ప్లాంట్ ఎక్స్క్లూజివ్ బస్పాస్లు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇంకో వారం తరువాత అన్ని డిపోల్లోనూ పాస్లు జారీ చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Updated Date - 2020-10-04T12:05:39+05:30 IST