స్వర్ణ ప్యాలెస్ ఘటనపై హీరో రామ్ సంచలన ట్వీట్లు
ABN, First Publish Date - 2020-08-15T19:19:17+05:30
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై టాలీవుడ్ హీరో రామ్ పోతినేని స్పందించారు. పెద్ద కుట్ర జరుగుతోందంటూ సీఎం జగన్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై టాలీవుడ్ హీరో రామ్ పోతినేని స్పందించారు. పెద్ద కుట్ర జరుగుతోందంటూ సీఎం జగన్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘హోటల్ స్వర్ణ ప్యాలస్ని రమేశ్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు?’’ అని ప్రశ్నించారు. ఫైర్ + ఫీజు = ఫూల్స్ అంటూ మరో ట్వీట్ చేశారు. అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మేనేజ్మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న స్వర్ణప్యాలెస్ డైరెక్ట్గా బిల్లింగ్ చేసిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనివెనక పెద్ద కుట్ర జరుగుతున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. సీఎంని తప్పుగా చూపించడానికని వ్యాఖ్యానించారు. ‘‘మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్కీ, మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం’’ అని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2020-08-15T19:19:17+05:30 IST