నెల్లూరుకు చేరుకున్న ఎంపీ దుర్గప్రసాద్ భౌతికకాయం
ABN, First Publish Date - 2020-09-17T13:00:44+05:30
చెన్నై అపోలో చికిత్స పొందుతూ కన్నుమూసిన తిరుపతి యంపీ బల్లి దుర్గాప్రసాద్ భౌతికకాయం నెల్లూరు జిల్లా వెంకటగిరి స్వస్థలానికి చేరుకుంది.
నెల్లూరు: చెన్నై అపోలో చికిత్స పొందుతూ కన్నుమూసిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ భౌతికకాయం నెల్లూరు జిల్లా వెంకటగిరి స్వస్థలానికి చేరుకుంది. ఈ సందర్భంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రముఖులు ఎంపీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించనున్నారు. నేటి ఉదయం 10.30 గంటలకు వెంకటగిరి కర్ణకమ్మవీధిలో స్వగృహం నుండి అంతిమయాత్ర ప్రారంభంకానుంది. అమ్మవారిపేట చెరువు వద్ద ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఎంపీ దుర్గాప్రసాద్ అంత్యక్రియలు జరుగనున్నాయి.
Updated Date - 2020-09-17T13:00:44+05:30 IST