నూతన పరకామణి భవనానికి టీటీడీ చైర్మన్ శంకుస్థాపన
ABN, First Publish Date - 2020-08-14T15:31:14+05:30
నూతన పరకామణి భవనానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
తిరుమల: నూతన పరకామణి భవనానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ... అత్యాధునాతన సౌకర్యాలతో భవన నిర్మాణం చేస్తామని తెలిపారు. 9 కోట్ల వ్యయంతో దాత మురళీకృష్ణ సహకారంతో భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. కానుకల లెక్కింపును భక్తులు వీక్షించేలా భవన నిర్మాణం చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2020-08-14T15:31:14+05:30 IST