‘ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండండి’
ABN, First Publish Date - 2020-04-29T00:22:57+05:30
రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరికాసేపట్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం
అమరావతి: రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరికాసేపట్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పిడుగులు ఏ ఏ ప్రాంతాల్లో పడే అవకాశం ఉందంటే..
ప్రకాశం జిల్లా: మార్కాపురం, తర్లుపాడు, అర్ధవీడు, కొనకనమిట్ల.
నెల్లూరు జిల్లా: నెల్లూరు, పొదలకూరు, చేజర్ల, కలువాయ, రాపూర్, బలయపల్లి, వెంకటగిరి, కలువాయి, ఓజిలి, గూడూరు, చిత్తమూరు, సైదాపురం, దక్కలి.
చిత్తూరు జిల్లా: చిత్తూరు, శ్రీకాళహస్తీ, తోట్టంబేడు, పాలసముద్రం, గంగాధరనెల్లూరు.
ఈ మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని అధికారులు ప్రకటించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు, కూలీలు, పశువుల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు.
Updated Date - 2020-04-29T00:22:57+05:30 IST