ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో శానిటైజర్ తాగి నలుగురు మృతి

ABN, First Publish Date - 2020-08-08T03:15:13+05:30

పట్టణంలోని స్కావింజర్స్ కాలనీలో శానిటైజర్ తాగి నలుగురు మృత్యువాత పడ్డారు. వెంకటరత్నం, కుమార్, వీరయ్య, శ్రీనివాసులు నలుగురూ కలిసి శానిటైజర్ సేవించారు. అయితే ఉదయం 11 గంటలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి : పట్టణంలోని స్కావింజర్స్ కాలనీలో శానిటైజర్ తాగి నలుగురు మృత్యువాత పడ్డారు. వెంకటరత్నం, కుమార్, వీరయ్య, శ్రీనివాసులు నలుగురూ కలిసి శానిటైజర్ సేవించారు. అయితే ఉదయం 11 గంటలకు వెంకటరత్నం మృతి చెందాడు. సాయంత్రం 4.30 కి కుమార్ చనిపోయాడు. ఇద్దరూ చనిపోవడాన్ని గమనించిన వీరయ్య, శ్రీనివాసులు బంధువులు వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేర్పించిన కాసేపటికే వీరయ్య, శ్రీనివాసులు కూడా మరణించారు. వీరి మరణంతో స్కావింజర్స్ కాలనీలో విషాదం నెలకొంది. మద్యం ధరలు పెరగడం వల్లే ఈ మరణాలు చోటు చేసుకున్నాయని మృతుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మృతి చెందిన వారిలో ఇద్దరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.

Updated Date - 2020-08-08T03:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising