ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఇద్దరు మంత్రులు మూర్ఖంగా ప్రవర్తించారు: నాగ జగదీష్

ABN, First Publish Date - 2020-06-18T18:31:51+05:30

శాసనమండలిలో బుధవారం వైసీపీ మంత్రులు అనిల్ కుమార్, వెల్లంపల్లి శ్రీనివాస్ మూర్ఖంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: శాసనమండలిలో బుధవారం వైసీపీ మంత్రులు అనిల్ కుమార్, వెల్లంపల్లి శ్రీనివాస్ మూర్ఖంగా ప్రవర్తించారని, ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క సీఎం తప్ప మంత్రులంతా మండలిలోనే ఉన్నారని, ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయారని విమర్శించారు. అనిల్ కుమార్ అయితే సభలో ప్రజాప్రతినిధిగా వ్యవహరించలేదని, బూతులు మాట్లాడారని ఏం పీక్కుంటారో పీక్కోండంటూ వ్యాఖ్యలు చేశారన్నారు. మరో మంత్రి శ్రీనివాస్  అయితే సభ్యులమనే గౌరవం లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. 151మందితో అధికారంలోకి వచ్చామని మంత్రులు విర్రవీగిపోయి నోటికొచ్చినట్లు బూతులు తిట్టారేతప్ప ప్రజలకు ఉపయోగపడే చర్చలు జరగలేదని నాగ జగదీష్ అన్నారు.

Updated Date - 2020-06-18T18:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising