ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీని ఢీకొని అగ్నికి ఆహుతి

ABN, First Publish Date - 2020-12-28T09:43:49+05:30

బైక్‌, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో ద్విచక్రవాహనం పెట్రోల్‌ ట్యాంక్‌ పేలి మంటలు వ్యాపించడంతో ఇద్దరూ అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం


గుత్తిరూరల్‌, డిసెంబరు 27: బైక్‌, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో ద్విచక్రవాహనం పెట్రోల్‌ ట్యాంక్‌ పేలి మంటలు వ్యాపించడంతో ఇద్దరూ అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని యంగిలిబండ గ్రామ శివారులో 67వ జాతీయ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. యాడికి మండలం బోగాలకట్ట గ్రామానికి చెందిన రోషిరెడ్డి (65), నగరూరు వాసి నారాయణరెడ్డి (38) గుత్తిలోని బాట సుంకులమ్మ అమ్మవారిని దర్శించుకుని బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరారు. యంగిలిబండ గ్రామ శివారులోకి రాగానే వారి వాహనం ఎదరుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ సమయంలో బైక్‌ పెట్రోల్‌ ట్యాంకు పేలి మంటలు ఎగసిపడ్డాయి. నారాయణ రెడ్డి, రోషి రెడ్డి ఈ మంటల్లో తీవ్రంగా కాలిపోయి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మంటలు అంటుకుని లారీ కూడా దగ్ధమైంది.

Updated Date - 2020-12-28T09:43:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising