లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్
ABN, First Publish Date - 2020-07-10T02:34:27+05:30
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్
విజయవాడ: అవినీతి రహిత పాలన అందించాలన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయానికి కొంత మంది అధికారులు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరగరాదని సీఎం జగన్ చెబుతున్నప్పటికీ కొంత మంది అధికారులు లెక్క చేయడం లేదు. ఈ నేపథ్యంలో లంచం తీసుకుంటూ భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ జియాలజిస్ట్ కె. వీరాస్వామి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో విజయ్ సాగర్ లీజుకు తీసుకున్న పట్టాభూమిలో ఇసుక తవ్వకానికి వీరాస్వామి రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Updated Date - 2020-07-10T02:34:27+05:30 IST