ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30 శాతమే కొంటాం!

ABN, First Publish Date - 2020-06-02T09:01:53+05:30

‘రాష్ట్రంలో రైతులు పండించిన పంటలో 30 శాతం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మిగతా 70ు పంట మార్కెట్లో కనీస మద్దతు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిగతా పంటకు గిట్టుబాటు వచ్చేలా చూస్తాం: సీఎం


అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో రైతులు పండించిన పంటలో 30 శాతం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మిగతా 70% పంట మార్కెట్లో కనీస మద్దతు ధరకు అమ్ముడయ్యేలా చర్యలు తీసుకుంటాం’ అని సీఎం జగన్‌ తెలిపారు. సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పంటల ప్రణాళిక, ఈ-మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాంపై ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్కెటింగ్‌ చేయలేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం 30% పంట కొనుగోలు చేస్తే.. మార్కెట్‌లో పోటీతత్వం పెరిగి మిగిలిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుంది. దీని కోసం ఈ-మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలి. ఈ-మార్కెటింగ్‌లో పంట అమ్మాలంటే నాణ్యత చాలా ముఖ్యం. ఇందుకోసం 10,641 రైతుభరోసా కేంద్రాల్లో గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ సదుపాయాలు కల్పించాలి’ అని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-06-02T09:01:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising