విద్యుత్ ఉద్యోగుల విభజన పూర్తి
ABN, First Publish Date - 2020-07-11T08:43:55+05:30
ఆరేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల మ ధ్య నలుగుతున్న విద్యుత్ ఉద్యోగుల విభజన ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. విభజనలో భాగంగా
అమరావతి, జులై 10(ఆంధ్రజ్యోతి): ఆరేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల మ ధ్య నలుగుతున్న విద్యుత్ ఉద్యోగుల విభజన ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. విభజనలో భాగంగా ఏపీకి కేటాయించిన 536 మంది ఉద్యోగులకు ఇక్కడి విద్యుత్ సంస్థలు పోస్టింగులిచ్చాయి. ఈ అంశం పరిష్కారానికి సుప్రీం కోర్టు జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ను నియమించి, అన్ని వైపుల నుంచి వినతులను పరిశీలించిన పిదప ఈ కమిషన్ జూన్ 20న తుది తీర్పు వెలువరించింది. దీనిప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి 655 మంది వ స్తే... ఏపీ నుంచి తెలంగాణకు 655 వెళ్లారు. కానీ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారిని, రిటైర్ అయిన వారిని ఈ జాబితాల నుంచి మినహాయించారు. తుది కేటాయింపుల తర్వాత జీతాల పద్దు కింద ఏపీలోని విద్యుత్ సంస్థలకు తెలంగాణ రాష్ట్రం రూ.131 కోట్లు ఇవ్వాలని తేల్చారు.
Updated Date - 2020-07-11T08:43:55+05:30 IST