తెనాలిలో గుట్కా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి
ABN, First Publish Date - 2020-09-26T14:30:11+05:30
జిల్లాలోని తెనాలిలో గుట్కా ప్యాకెట్ల స్థావరాలపై శుక్రవారం రాత్రి వన్ టౌన్ పోలీసులు మెరుపు దాడి చేశారు.
గుంటూరు: జిల్లాలోని తెనాలిలో గుట్కా ప్యాకెట్ల స్థావరాలపై శుక్రవారం రాత్రి వన్ టౌన్ పోలీసులు మెరుపు దాడి చేశారు. మార్కెట్ సెంటర్లో పెద్ద మొత్తంలో నిషేధిత గుట్కా నిల్వలు ఉన్నాయన్న సమాచారం అందుకున్న డీఎస్పీ కే.శ్రీలక్ష్మి , వన్ టౌన్ సీఐ ఎం.రాజేష్, ఎస్ఐ అనిల్ కుమార్లు దాడులు చేపట్టగా అప్పుడే దిగుమతి అవుతున్న రూ.20లక్షల విలువైన 70బస్తాల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా వ్యాపారి మాధవ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2020-09-26T14:30:11+05:30 IST