తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్ వల్ల ఏపీకి నష్టం: ఆదిత్యనాథ్
ABN, First Publish Date - 2020-06-04T23:38:08+05:30
తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్ వల్ల ఏపీకి నష్టమని ఏపీ ఇరిగేషన్ స్పెషల్ ఛీప్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ చెప్పారు. 6గంటలుగా కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతోంది.
హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్ వల్ల ఏపీకి నష్టమని ఏపీ ఇరిగేషన్ స్పెషల్ ఛీప్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ చెప్పారు. 6గంటలుగా కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతోంది. తెలంగాణ తరపున వాదనలు రజత్కుమార్, ఏపీ తరపున ఆదిత్యనాథ్ దాస్ వాదనలు విన్పించారు. ఏపీకి నీటి కేటాయింపులకు అనుగుణంగానే పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపట్టామని ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్లు మార్చిందని, అందుకే తెలంగాణ ప్రాజెక్టులను కొత్తవిగా పరిగణించాలన్నారు. ఉమ్మడి ఏపీలో జరిగిన ప్రతిపాదనలకు... వీటికి పొంతనలేదని, తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్ వల్ల ఏపీకి నష్టమని ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు.
Updated Date - 2020-06-04T23:38:08+05:30 IST