మంత్రి జయరామ్పై చర్యలు తీసుకోవాలి: బుద్దా
ABN, First Publish Date - 2020-10-07T10:22:56+05:30
మంత్రి జయరామ్పై చర్యలు తీసుకోవాలి: బుద్దా
విజయవాడ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మంత్రి జయరాం ల్యాండ్ స్కాంపై విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బుధవారం ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ‘ఈఎ్సఐ స్కాంలో బెంజ్ కారు కొట్టేసిన జయరాం కన్ను ఆలూరులోని 450 ఎకరాలపై పడింది. ఇట్టినా కంపెనీకి చెందిన భూమిని తప్పుడు పత్రాలతో మంత్రి గ్యాంగ్ కొట్టేసింది’ అంటూ ట్వీట్ చేశారు.
Updated Date - 2020-10-07T10:22:56+05:30 IST