చంద్రబాబుపై ఉన్న కక్షతోనే సిట్: శ్రవణ్
ABN, First Publish Date - 2020-02-22T21:12:14+05:30
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం సిట్ వేసిందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ ఆరోపించారు. వెలగపూడిలో రైతులు
అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం సిట్ వేసిందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ ఆరోపించారు. వెలగపూడిలో రైతులు చేపట్టిన 24 గంటల దీక్షకు శ్రవణ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని విమర్శించారు. జగన్ తన బురదను అందరికీ అంటించాలనుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ చర్యలను ప్రజలంతా ఖండించాలన్నారు. పోలీసులతో సిట్ వేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని శ్రవణ్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2020-02-22T21:12:14+05:30 IST