జగన్ తుగ్లక్ నిర్ణయాల వల్ల ప్రజలు నష్టపోతున్నారు: గద్దె
ABN, First Publish Date - 2020-08-07T00:02:29+05:30
అమరావతి విషయంలో వైసీపీ ప్రజలను మోసం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. చంద్రబాబుకు స్థాయి లేదని మాట్లాడటానికి వైసీపీ
విజయవాడ: అమరావతి విషయంలో వైసీపీ ప్రజలను మోసం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. చంద్రబాబుకు స్థాయి లేదని మాట్లాడటానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలన్నారు. పక్కనే ఉన్న రాజధాని.. విశాఖ వెళ్లిపోతుంటే చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ ముందుకెళ్లి అభిప్రాయం చెప్పలేరని తెలిపారు. జగన్ తానా అంటే...మంత్రులు తందానా అంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి వాస్తవ పరిస్థితి వివరించలేని దుస్థితిలో మంత్రులు ఉన్నారని వ్యాఖ్యానించారు. జగన్ తుగ్లక్ నిర్ణయాల వల్ల అంతిమంగా ప్రజలే నష్టపోతున్నారని చెప్పారు. ప్రజలు విధించే శిక్షకు త్వరలో జగన్ అడ్రస్ లేకుండా పోతారన్నారు.
Updated Date - 2020-08-07T00:02:29+05:30 IST