ఏపీలో టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి: శ్రవణ్
ABN, First Publish Date - 2020-06-06T14:25:09+05:30
ఏపీలో టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి: శ్రవణ్
అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆ పార్టీ నేత శ్రవణ్ కుమార్ విమర్శించారు. ఏబీఎన్ డిబేట్లో మాట్లాడుతూ దాదాపు 800 మంది టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని... 8 మందిని చంపారని అన్నారు. వైసీపీ అరాచకాలు, బెదిరింపులు తాళలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. పోలీసులు నిందితులపై కేసులు పెట్టకుండా... బాధితులపైనే దాష్టీకాలకు పాల్పడ్డ ఘటనలు అనేకమన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులకు చట్టమంటే గౌరవమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి అధికారులు వంత పాడుతున్నారని... పార్టీలను అణగదొక్కేందుకు ఇంటెలిజెన్స్ను వాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతోందని శ్రవణ్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2020-06-06T14:25:09+05:30 IST