ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడింది: కేశినేని నాని

ABN, First Publish Date - 2020-05-30T18:49:28+05:30

న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడింది: కేశినేని నాని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎస్‌ఈసీ నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేయడంపై ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘న్యాయం గెలిచింది..చట్టం గెలిచింది.. ప్రజాస్వామ్యం గెలిచింది.. రాజ్యాంగం గెలిచింది. న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడింది’’ అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు. 


ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తొలగించడమే లక్ష్యంగా.... జారీ చేసిన ఆర్డినెన్స్‌ను, ఇతర జీవోలను హైకోర్టు కొట్టివేసింది. తప్పుచేసినట్లు రుజువు చేసి అభిశంసిస్తే తప్ప... ఆయనను అర్ధంతరంగా పదవి నుంచి తప్పించలేరని తేల్చిచెప్పింది. ‘నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా ఐదేళ్లూ పదవిలో ఉండటం ఆయన హక్కు. దానిని మధ్యలో ఎవరూ లాక్కోలేరు’ అని స్పష్టం చేసింది. ఆయనను పూర్తికాలం పదవిలో కొనసాగించాలని హైకోర్టు  ఆదేశించిన విషయం తెలిసిందే. 




Updated Date - 2020-05-30T18:49:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising