ఎమ్మెల్యే పీఏ, కారు డ్రైవర్కు పరిహారం చెల్లించారు.. జ్యోతుల నెహ్రూ ఫైర్
ABN, First Publish Date - 2020-11-04T03:05:34+05:30
వైసీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టం చెల్లింపులో వివక్ష చూపారని ఆయన ఆరోపించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన ...
రాజమండ్రి: వైసీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టం చెల్లింపులో వివక్ష చూపారని ఆయన ఆరోపించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులపై వైసీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పీఏ, కారు డ్రైవర్కు ఎలాంటి పంటనష్టం జరగకున్నా పరిహారం చెల్లించారని జ్యోతుల నెహ్రూ తెలిపారు.
కాగా ఇటీవల కాలంలో ఏపీలో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వర్షాల దాటికి తూర్పుగోదావరి జిల్లాలో పంట నష్టం భారీగా జరిగింది. దీంతో పంట నష్టపోయిన ప్రభుత్వం పరిహారం చెల్లించింది. అయితే ఈ పరిహారం చెల్లింపులో స్థానిక అధికార పార్టీ నేతలు చేతివాటం చూపినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Updated Date - 2020-11-04T03:05:34+05:30 IST