ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న వసతి దీవెన కాదు...: జవహర్

ABN, First Publish Date - 2020-02-25T21:27:03+05:30

ప.గో.: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా కొత్త సీసాలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో.: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా కొత్త సీసాలో పాత సారా లాంటివని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన కాదని.. జగనన్న వంచన అని విమర్శించారు. టీడీపీ గతంలో ప్రవేశపెట్టిన పథకాన్నే పేరుమార్చి కొత్త స్కీమ్‌గా బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. డైట్ ఛార్జీల కింద నెలకు రూ 1,400 చొప్పున 10 నెలల్లో రూ. 14 వేలు ఇచ్చామన్నారు. దీనికి అదనంగా మరో రూ. 5వేలు కాస్మటిక్స్ కింద అందజేశామన్నారు. డైట్ ఛార్జీలను నెలకు రూ 1,400కు పెంచింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు.


తొమ్మిది నెలల పాలనతో ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని జవహర్ విమర్శించారు. ఈ ప్రభుత్వం చేసిందేమిటంటే.. గోదావరి బండ్ తవ్వి ఇసుక అక్రమ రవాణా చేయడమేనని అన్నారు. ఏసియాలో నెంబర్ టుగా ఉన్నటువంటి రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ కిందే ఇసుక తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారని విమర్శించారు. అన్న క్యాంటిన్లు ఫోటోలు మార్చారు గాని అన్న క్యాంటీన్లు తెరవలేదని, పేదవాడి కడుపు మంట చల్లార్చలేకపోయారని జవహర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.


Updated Date - 2020-02-25T21:27:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising