డబ్బులు ఇస్తేనే పేదలకు ఇంటిస్థలమా?: దేవినేని
ABN, First Publish Date - 2020-06-05T15:52:58+05:30
డబ్బులు ఇస్తేనే పేదలకు ఇంటిస్థలమా?: దేవినేని
అమరావతి: ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రూ.వందల కోట్ల కుంభకోణం. డబ్బులు ఇస్తేనే పేదలకు ఇంటిస్థలమా?. భూసేకరణ పేరుతో వైసీపీ నేతలు రూ.కోట్లు వసూలు చేస్తున్నారు. అడిగితే బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఇంతటి విధ్వంసం ఎప్పుడూ చూడలేదు’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.
Updated Date - 2020-06-05T15:52:58+05:30 IST