పోలీసుల తీరుపై మండిపడ్డ జేసీ ప్రభాకర్రెడ్డి
ABN, First Publish Date - 2020-12-30T20:59:12+05:30
జిల్లా పోలీసుల తీరుపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను
అనంతపురం: జిల్లా పోలీసుల తీరుపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పోలీసులు మిస్ యూస్ చేస్తున్నారని ఆరోపించారు. మేము ఎలాంటి ఫిర్యాదు చేయకున్నా రాజకీయ ప్రత్యర్థులపై పోలీసులు ఎలా కేసులు బుక్ చేస్తారని నిలదీశారు. తన ఇంటిలో ఏం జరిగిందో ప్రతీది సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిందని చెప్పుకొచ్చారు. అయినా కూడా ఎలాంటి విచారణ లేకుండా కేసులు నమోదు చేస్తున్నారని దుయ్యబట్టారు. దళితుల హక్కులను కాపాడుకోవాలన్నారు. కేసులపై పోలీసులతో పోరాటం చేస్తానని జేసీ ప్రభాకర్రెడ్డి ప్రకటించారు.
Updated Date - 2020-12-30T20:59:12+05:30 IST