ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌, విజిలెన్స్‌, మైనింగ్‌శాఖలు ఏం చేస్తున్నాయి?: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-05-30T22:00:24+05:30

పోలీస్‌, విజిలెన్స్‌, మైనింగ్‌శాఖలు ఏం చేస్తున్నాయి?: దేవినేని ఉమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన రూ.1,850 కోట్లు..లిక్కర్‌ కంపెనీలు, కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. పోలవరానికి ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఏడాది పాలనలో ఒక్క ఇల్లు అయినా కట్టారా?.  రూ.70 వేల కోట్ల రెవెన్యూలోటు ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటట్లేదని విమర్శించారు. అమరావతి కోసం 65 మంది రైతులు చనిపోతే కనీసం పరామర్శించలేదన్నారు. ఏడాదిలో ఒక్కసారైనా అమరావతి పేరు జగన్‌ నోటివెంట వచ్చిందా?. గోదావరి పాయల్లోంచి నీళ్లు తెస్తామన్నారు.. ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో కమీషన్లు దోచుకున్నారని ఆరోపించారు. శాండ్‌, ల్యాండ్‌, మైన్‌, వైన్‌ని దోచుకుంటున్నారని అన్నారు. నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యునల్‌ ఆదేశాలను లెక్కచేయకుండా లక్షల టన్నుల ఇసుకను పందికొక్కుల్లా తోడారు..పోలీస్‌, విజిలెన్స్‌, మైనింగ్‌శాఖలు ఏం చేస్తున్నాయి? అని ప్రశ్నించారు. 

Updated Date - 2020-05-30T22:00:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising