ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హక్కుల అణచివేత ఆపండి!

ABN, First Publish Date - 2020-12-19T07:15:31+05:30

రాష్ట్రంలో శాంతి భధ్రతలు కాపాడటానికి బదులు, ప్రజల ప్రాథమిక హక్కులు అణిచివేసేందుకు పోలీసులు శ్రద్ధ చూపడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీకి వత్తాసు పలకడం మానండి 

శాంతి భధ్రతలపై దృష్టి సారించండి

డీజీపీ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ


అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతి భధ్రతలు కాపాడటానికి బదులు, ప్రజల ప్రాథమిక హక్కులు అణిచివేసేందుకు పోలీసులు శ్రద్ధ చూపడం విడ్డూరంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై అసంతృప్తిని వెలిబుచ్చేవారిని అణిచివేయడానికి బదులు శాంతి భద్రతలపై దృష్టి సారించాలని డీజీపీకి సూచించారు. అమరావతి ఆందోళనకు ఏడాది అయిన సందర్భంగా గురువారం అమరావతి పరిరక్షణ సమితి సభ నిర్వహించింది. దీనికి మద్దతు పలికిన టీడీపీ నేతలు 600 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కావొద్దని, అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. దీనిపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్రబాబు శుక్రవారం లేఖ రాశారు. అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి రక్షణ కవచమని, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వమే అణిచివేతకు పాల్పడటం దారుణమన్నారు.  ‘‘రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పరిరక్షించడం పోలీసుల విధి. అణిచివేత మాని శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలి’’అని చంద్రబాబు కోరారు. 

Updated Date - 2020-12-19T07:15:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising