అమరావతిపై రాజకీయ విద్వేషం చిమ్ముతున్నారు: సుజనాచౌదరి
ABN, First Publish Date - 2020-07-04T22:50:55+05:30
అమరావతిపై రాజకీయ విద్వేషం చిమ్ముతున్నారని బీజేపీ నేత సుజనాచౌదరి మండిపడ్డారు. అమరావతి 29 గ్రామాల సమస్య కాదని, 13 జిల్లాల ప్రజల రాజధాని అని
అమరావతి: అమరావతిపై రాజకీయ విద్వేషం చిమ్ముతున్నారని బీజేపీ నేత సుజనాచౌదరి మండిపడ్డారు. అమరావతి 29 గ్రామాల సమస్య కాదని, 13 జిల్లాల ప్రజల రాజధాని అని, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. అమరావతి విషయంలో కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని వెల్లడించారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదన్నారు. అమరావతి ఉద్యమానికి బీజేపీ మద్దతు ఉంటుందని, అమరావతి రైతుల ఉద్యమం విజయవంతమవుతుందని సుజనాచౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated Date - 2020-07-04T22:50:55+05:30 IST