శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేత
ABN, First Publish Date - 2020-09-17T13:53:33+05:30
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు.
కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 2,22,221 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 3,50,422 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలుగా నమోదు అయ్యింది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Updated Date - 2020-09-17T13:53:33+05:30 IST