మూడు రాజధానులతో రాష్ట్రాభివృద్ధికి మోకాలడ్డు
ABN, First Publish Date - 2020-02-07T08:35:17+05:30
రాష్ట్రంలో మూడు రాజధానుల పేరు తో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రాభివృద్దికి మోకాలడ్డుతున్నారని టీడీపీ
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావు
రాష్ట్రంలో మూడు రాజధానుల పేరు తో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రాభివృద్దికి మోకాలడ్డుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. గురు వారం గేదెలపేటలో గేదెల ఎర్రంనాయుడు కుంటుంబాన్ని పరామ ర్శించారు. అమరావతిని రాజధానిగా ఉండాలని ప్రజలు కోరుకుంటుం టే మూడు రాజధానులంటూ జగన్ ప్రజల్లో భయాందోళన కలిగి స్తున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించ కుండా కేవలం కక్ష పూరిత రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసు సాయం లేకుండా ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. జగన్ పిచ్చితుగ్లక్ తాతని ఎద్దేవా చేశారు. ప్రజలు వైసీపీకి ఓట్లు వేసి తప్పు చేశామని లెంపలు వేసుకుంటు న్నారన్నారు. ఎన్ని కలు ఎప్పుడు వచ్చినా జగన్కి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురుచూ స్తున్నారన్నారు. జగన్కు రోజులు దగ్గర పడ్డాయని, జైలుకి వెళ్లడం ఖా యమని జోస్యం చెప్పారు. నాయకులు టంకాల మౌళీశ్వరరావు, కామోజుల సీతారాం, బెవర జగన్నాథరావు తదితరులున్నారు.
Updated Date - 2020-02-07T08:35:17+05:30 IST