‘ఆదిత్య’లో 16 నుంచి అధ్యాపకుల శిక్షణ
ABN, First Publish Date - 2020-11-14T04:40:23+05:30
ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏఐసీటీఐ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ అకాడమీ సహకారంతో ఈనెల 16 నుంచి 20 వరకు ‘ఎలక్ట్రికల్ వెహికల్స్’ అనే అంశంపై జాతీయస్థాయి అధ్యాపక అభివృద్ధి శిక్షణ తరగతులు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వీవీ నాగేశ్వరరావు తెలిపారు.
కె.కొత్తూరు (టెక్కలి): ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏఐసీటీఐ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ అకాడమీ సహకారంతో ఈనెల 16 నుంచి 20 వరకు ‘ఎలక్ట్రికల్ వెహికల్స్’ అనే అంశంపై జాతీయస్థాయి అధ్యాపక అభివృద్ధి శిక్షణ తరగతులు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వీవీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ తరగతుల్లో ప్రముఖ ఐఐటీ, ఎన్ఐటీ, పలు యూనివర్సిటీ, కళా శాలలు, ఇతర వాణిజ్యరంగ సంస్థ ప్రతినిధులు పాల్గొని నేటి ఆధునిక కాలంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం ఆవశ్యకతపై అవగాహన కలిగిస్తారన్నారు. రిసోర్స్పర్సన్లుగా ప్రొఫెసర్ మల్లికార్జునరావు, డాక్టర్ శశిధర్, డాక్టర్ లలితకుమార్ సాహు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సతీష్ కుమార్, అమిత్ పాల్గొంటారని చెప్పారు. శిక్షణా తరగతులకు కో-ఆర్డినేటర్గా డాక్టర్ విజయ్కుమార్, ప్రొఫెసర్ బి.మన్మ థరావు, డాక్టర్ జి.రామారావు వ్యవహరిస్తారన్నారు.
Updated Date - 2020-11-14T04:40:23+05:30 IST