కళాను కలిసిన టీడీపీ నేతలు
ABN, First Publish Date - 2020-10-30T11:34:27+05:30
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడిగా ఎంపికైన కిమిడి కళావెంకటరావును విజయనగరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున నాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
రాజాం, అక్టోబరు 29: టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడిగా ఎంపికైన కిమిడి కళావెంకటరావును విజయనగరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున నాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రా జాంలోని కళా క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని సహకారం అందించాలని కోరారు. యువ నాయకుడుగా పార్టీ నియోజకవర్గం పగ్గాలు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయు, కార్యదర్శి నారా లోకేష్ అప్పగించారని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కళా సూచించారు.
ఆయనతో పాటు పార్టీ నాయకులు రౌతు కాము నాయు డు, పైల బలరాం, దన్నాన రామచంద్రుడు, రౌతు నారాయణరావు తది తరులు పాల్గొన్నారు. అలాగే పార్టీ జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలు కావలి ప్రతిభాభారతి కుమార్తె, టీడీపీ యువనేత గ్రీష్మాప్రసాద్ కూడా కళాను కలిసి అభినందించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని కళా ఆమెకు సూచించారు ఆమెతో పాటు పార్టీ నాయకులు టంకాల కన్నం నాయుడు, కె.బసవరాజు, అడపా శ్రీను తదితరులున్నారు.
Updated Date - 2020-10-30T11:34:27+05:30 IST