ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాలయాల పరిరక్షణకు శాంతి కమిటీలు

ABN, First Publish Date - 2020-10-07T10:10:00+05:30

మండలంలోని దేవాలయాలు పరిరక్షణకు శాంతి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ వై.కృష్ణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీముఖలింగం (జలుమూరు), అక్టోబరు 6: మండలంలోని దేవాలయాలు పరిరక్షణకు శాంతి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ వై.కృష్ణ తెలిపారు. శ్రీముఖలింగం దేవాలయానికి 11 మంది సభ్యులతో శాంతి కమిటీ ఏర్పాటుకు మంగళవారం గ్రామస్థులు, అర్చకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు, చర్చిలు, మసీదులున్న గ్రామాల్లో మతపరమైన సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శ్రీముఖలింగం, జలుమూరు, పాగోడు, కరవంజ, చల్లవానిపేట గ్రామాల్లో శాంతి కమిటీలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రజలు సహకరించాలని కోరారు.


ఆలయాల్లో రక్షణ చర్యలు

హిరమండలం: ఇటీవల కాలంలో ఆలయాల్లో వరుస ఘటనల నేపథ్యంలో దేవాలయాలు, ప్రార్థనా మందిరాల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని పాతపట్నం సీఐ రవి ప్రసాద్‌ పేర్కొన్నారు. మంగళవారం హిరమండలం గణపతి ఆలయం, సాయిబాబా మందిరం, నీలమణి దుర్గ ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయాల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-07T10:10:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising