పోర్టు నిర్వాసితులకు న్యాయం చేస్తాం
ABN, First Publish Date - 2020-10-04T10:31:10+05:30
భావనపాడు పోర్టు నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు తెలిపారు. శనివారం దేవునల్తాడ గ్రామ స్థులతో సమావేశం నిర్వహించారు.
పోర్టు నిర్వాసితులకు న్యాయం చేస్తాం
వజ్రపుకొత్తూరు, అక్టోబరు 3: భావనపాడు పోర్టు నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు తెలిపారు. శనివారం దేవునల్తాడ గ్రామ స్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఆర్ చట్టం- 2013 ప్రకారం పరిహారం చెల్లించనున్నట్లు చెప్పారు.
అయితే మరికొన్ని మినహాయింపులతో అదనపు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. త్వరలో మూడు గ్రామాల ప్రజలతో సమావేశం ఏర్పాటుచేసి విధి విధానాలతో పాటు పరిహారం కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్థులు 32 డిమాండ్లను మంత్రి ముందు వినిపించారు. కాగా అంతకుముందు గ్రామస్థులు సమావేశమై తమ డిమాండ్లను ప్ర భుత్వం అంగీకరిస్తేనే భావనపాడు పోర్టు నిర్మాణానికి సహకరి స్తామని తీర్మానించారు.
Updated Date - 2020-10-04T10:31:10+05:30 IST