నిరుపేదలకు ఎస్ఐ ఆసరా
ABN, First Publish Date - 2020-03-30T10:37:02+05:30
కరోనా ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలను ఆదుకునేందుకు సంతబొమ్మాళి ఎస్ఐ వి.కామేశ్వరరావు ముందుకొచ్చారు. సంతబొమ్మాళి, శివరాంపురం, వెంకటాపురం తదితర
సంతబొమ్మాళి: కరోనా ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలను ఆదుకునేందుకు సంతబొమ్మాళి ఎస్ఐ వి.కామేశ్వరరావు ముందుకొచ్చారు. సంతబొమ్మాళి, శివరాంపురం, వెంకటాపురం తదితర గ్రామాల్లో ఆకలితో అలమటిస్తున్న 500 మంది నిరుపేదలను గుర్తించి తన సొంత నగదు రూ.60 వేలతో వారికి నిత్యవసర సరుకులు ఆదివారం అందజేశారు. పేదలకు సరుకులను పంపిణీ చేసిన ఎస్ఐ కామేశ్వరరావును పలువురు అభినందిం చారు.
Updated Date - 2020-03-30T10:37:02+05:30 IST