భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి
ABN, First Publish Date - 2020-09-30T10:40:26+05:30
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని, లేదంటే పోరాటాలు ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు హెచ్చరించారు.
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని, లేదంటే పోరాటాలు ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, గతంలో మాదిరిగా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికే విని యోగించాలని, కరోనాతో ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ.10వేల భృతి చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి మంతెన హరనాథ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి తేజేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - 2020-09-30T10:40:26+05:30 IST