రైతులకు ఉత్తమ సేవలు అందించండి
ABN, First Publish Date - 2020-07-04T11:19:53+05:30
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఉత్తమ సేవలు అందించాలని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు కె.శ్రీధర్ అన్నారు. శుక్రవారం నర్శిపురంలోలో
నందిగాం, జూలై 3: రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఉత్తమ సేవలు అందించాలని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు కె.శ్రీధర్ అన్నారు. శుక్రవారం నర్శిపురంలోలో వ్యవసాయ సహాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతుకి అవస రమైన ఎరువులు, ఇతర అవసరాలను సకాలంలో అందించి సూచనలు ఇచ్చి పంటల సాగులో అధిక దిగుబడులు సాధిం చుకునేలా చూడాలన్నారు.ఎస్సీ సబ్ప్లాన్ కింద ఎస్సీలకు మంజూరైన వ్యవసాయ యూనిట్లను జేడీఏ కె.శ్రీధర్, టెక్కలి వైసీపీ సమన్వయకర్త పేరాడ తిలక్లు పంపిణీ చేశారు.
Updated Date - 2020-07-04T11:19:53+05:30 IST