ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి టెన్త్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

ABN, First Publish Date - 2020-04-08T11:54:15+05:30

పదో తరగతి విద్యార్థులు ఇంటి నుంచే పరీక్షలకు సన్నద్ధమయ్యేలా బుధవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాతీపేట, ఏప్రిల్‌ 7 : పదో తరగతి విద్యార్థులు ఇంటి నుంచే పరీక్షలకు సన్నద్ధమయ్యేలా బుధవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి కృత్తిక మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నిర్మూలనకు లాక్‌డౌన్‌ ప్రకటించిన కారణంగా పాఠశాలలకు సెలవులు ఇచ్చిన నేపఽథ్యంలో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకున్నట్టు వివరించారు.


ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ, వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో దూరదర్శన్‌ - సప్తగిరి చానల్‌ ద్వారా పదోతరగతి విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనా కార్యక్రమాన్ని ఈనెల 8 నుంచి ప్రారంభిస్తారని  వివరించారు. ఉదయం 10 నుంచి 11, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో బోధనా కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపిక చేసిన రోజుల్లో ఫోన్‌-ఇన్‌ కార్యక్రమం ద్వారా నిపుణుల నుంచి విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకొనే సౌకర్యం కూడా కల్పించామని తెలిపారు.  

Updated Date - 2020-04-08T11:54:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising