రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN, First Publish Date - 2020-09-19T10:50:25+05:30
మందస మండలం మఖరజోల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లు మాధవరావు(40) మృతిచెందాడు. తన స్వగ్రామం అల్లిమెరక కాలనీ నుంచి అత్తవా
హరిపురం, సెప్టెంబరు 18 : మందస మండలం మఖరజోల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లు మాధవరావు(40) మృతిచెందాడు. తన స్వగ్రామం అల్లిమెరక కాలనీ నుంచి అత్తవారి ఊరు కుంటికోట కాలనీకి గురువారం రాత్రి నడిచి వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
దీంతో తీవ్రంగా గాయపడిన మాధవరావును స్థానికులు 108లో పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. కాగా ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న మాధవ రావుకి భార్య, ఇద్దరు కుమారులు, తల్లి తులసమ్మ ఉన్నారు. ఈ సంఘటనపై మందస ఎస్ఐ సీహెచ్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-09-19T10:50:25+05:30 IST