కరుణించు.. పైడితల్లి!
ABN, First Publish Date - 2020-03-16T09:41:52+05:30
పొందూరులో గ్రామదేవత పైడితల్లి అమ్మవారి 35వ జాతర మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక
పొందూరు, మార్చి 15 : పొందూరులో గ్రామదేవత పైడితల్లి అమ్మవారి 35వ జాతర మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సంద ర్భంగా అమ్మవారి విగ్రహాన్ని వీధుల్లో ఊరేగించారు. పట్టణానికి చెందిన మహిళలు ముర్రాటలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కోలాటం, ప్రత్యేక డ్రమ్ముల వాయిద్యాలు అందర్నీ అలరించాయి. జెయింట్వీల్ వద్ద చిన్నపిల్లలు సందడి చేశారు. ఇక అమ్మవారి ఆలయం వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక లైటింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
Updated Date - 2020-03-16T09:41:52+05:30 IST