ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లా వాసులకు ముఖ్య గమనిక.. జూలై 18 నుంచి..

ABN, First Publish Date - 2020-07-17T06:12:29+05:30

గుంటూరు జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూలై 18 నుంచి గుంటూరు జిల్లా మొత్తం లాక్‌డౌన్ అమలు

గుంటూరు: జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 18 నుంచి జిల్లా మొత్తం సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. వారం పాటు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే షాపులకు అనుమతి ఇవ్వనున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. కరోనా తీవ్రత జిల్లాలో రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది.


గుంటూరు జిల్లాలో కేవలం 10 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపయింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో గుంటూరు జిల్లాలో 287 కేసులు నమోదు కాగా.. మే నెలలో 223 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య జూన్ నెలకు అమాంతం పెరిగింది. జూన్ నెలలో గుంటూరు జిల్లాలో 1095 కరోనా కేసులు నమోదయ్యాయి. జూలై 15న గుంటూరు జిల్లాలో 468 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈ 468 కేసుల్లో ఒక్క గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే 235 కరోనా కేసులు నమోదు కావడం తీవ్రతకు అద్దం పడుతోంది.

Updated Date - 2020-07-17T06:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising