ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఈసారి..

ABN, First Publish Date - 2020-10-29T23:49:06+05:30

జగన్ సర్కార్ మందుబాబులకు శుభవార్త చెప్పింది. తాజాగా.. మద్యం ధరలను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్ సర్కార్ మందుబాబులకు శుభవార్త చెప్పింది. తాజాగా.. మద్యం ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మీడియం, ప్రీమియంలో 25శాతం వరకు ధరలను తగ్గిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో అబ్కారీశాఖ పేర్కొంది. ఈ తగ్గిన ధరలు రేపటి నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. 250 నుంచి 300 రూపాయల మధ్య ఉన్న మద్యం ధరలపై ప్రభుత్వం రూ.50 తగ్గించింది. దీంతో.. వివిధ కేటగిరీల్లో ధరలు తగ్గాయి. ఐఎమ్‌ఎఫ్‌ఎల్‌, విదేశీ మద్యం ధరలు తగ్గాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మద్యం అమ్మకాలు భారీగా పడిపోవడంతో ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించి.. సేల్స్‌ను పెంచాలని నిర్ణయించింది. మద్యం ధరలను తగ్గించి లిక్కర్‌ సేల్స్‌ ద్వారా ఖజానా నింపుకునే ప్రయత్నానికి తెరలేపింది. ఎన్నికల ప్రచారంలో మద్య నిషేధం పేరుతో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఇప్పుడు మాత్రం మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు ఉవ్విళ్లూరుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-10-29T23:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising